రామంచ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ములుపాల కుటుంబ సభ్యులు…
దర్గా అభివృద్ధికి కృషి చేస్తామన్న రాజు..
జనంసాక్షి/ చిగురుమామిడి (ఆగష్టు 14): మండలంలోని రామంచ గ్రామంలో గల దర్గాలో జరుగుతున్న ఉర్స్ ఉత్సవాల్లో ఆదివారం ములుపాల రాజు కుటుంబ సభ్యులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి దట్టికట్టి చద్దర్ ను కప్పి ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు పేర్కొన్నారు.అనంతరం దర్గా నిర్వాహకులు కరీం దర్గా అభివృద్ధికి కృషి చేయాలని వారిని కోరగా తప్పకుండా సహకరిస్తామని రాజు తెలిపారు.ఈ కార్యక్రమంలో ములుపాల రాజు,ములుపాల దేవేందర్,మేకల అశోక్,బెడ నర్సింగరావు,చల్లురి సాయి తదితరులు ఉన్నారు.