రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై 306 కేసు నమోదు చేయాలి.

ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితులకు అన్యాయం చేసింది కోరుకంటి చందర్ గారే

ఆత్మహత్య చేసుకున్న హరీష్ కుటుంబాన్ని పరామర్శించిన బీఎస్పీ నాయకులు
శంకరపట్నం ఆగస్టు 29 ( జనం సాక్షి న్యూస్)
రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ పై 306 సెక్షన్ కేసు నమోదు చేసి ఆర్ఎస్ సిఎల్ బాధితులు అందరికీ న్యాయం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ నిశాని రామచంద్రం అన్నారు. ఈరోజు మానకొండూరు నియోజకవర్గం కార్యకర్తలతో కలిసి ముంజ హరీష్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చడం జరిగింది. మృతుడి కుటుంబానికి 50 లక్షల ఎక్సగ్రేసీయా ప్రకటించి, అయన భార్య కి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని అన్నారు. రామగుండంలోని ఆర్ ఎఫ్ సి ఎల్ లో ఉద్యోగాల కోసం అధికార పార్టీ నాయకుల ను నమ్మి ఏడు లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయినందుకు అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకొని మరణించారు. ఆత్మహత్య చేసుకునే ముందు తాను రాసిన వాట్సాప్ మెసేజ్ ఆర్ఎఫ్సిఎల్ లో డబ్బులు కట్టి మోసపోయిన అందరికీ న్యాయం జరగాలని అందుకు నేను ప్రాణ త్యాగం చేస్తున్నానని మెసేజ్ రాయడం అందరి హృదయాలను కలిసి వేసిందని అడ్వకేట్ నిషాని రామచంద్రం అన్నారు. హరీష్ ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్య నే అని అన్నారు. తెలంగాణ రాస్ట్రం వస్తే నిరుద్యోగ సమస్య ఉండదని నమ్మబలికిన ముఖ్యమంత్రి మాట తప్పి అనేక మంది నోరుద్యోగ యువకుల మరణాలకు ఆయనే కారణం అని అన్నారు. నిరుద్యోగుల వద్ద లక్షలాది రూపాయలు లంచాలుగా స్థానిక ఎమ్మెల్యే గారే వసులు చేస్తున్నారని అన్నారు. ముంజ హరీష్ మరణం నిరుద్యోగ సమస్య పరిస్కారం కావాలని తన వాట్సాప్ మెసేజ్ లో తెలియచేసారు అని అన్నారు. ఈ రోజు పెద్దపెళ్లీ లో నూతన కలెక్టరేట్ ప్రారంభిస్తున్న ముఖ్య మంత్రి ఈ సమస్య మీద స్పందించాలని డిమాండ్ చేసారు. ఆర్ ఎఫ్ సి ఎల్ బాగోతం పై కేటీఆర్ గారు స్పందించకపోవడం వల్ల ఈ అవినీతి లో ఆయనకు కూడ సంబంధం ఉందని అన్నారు.
ఆ తరువాత ఇందుర్తి లో భర్త చేతిలో హత్య కు గురైన శంకరపట్నం కి చెందిన కనకం శిరీష తల్లితండ్రులను, ఆమె పిల్లలను కలిసి ఓదార్చినారు. నిందితుడికి యావజ్జీవా కారగార శిక్ష పడే విధంగా పోలీస్ లు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి, సాక్షాలను కోర్ట్ కి సమర్పించాలని పోలిస్ ని కోరారు. ఆయనతో జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్, అసెంబ్లీ ఇంచార్జ్ సంగుపట్ల మల్లేశం, అసెంబ్లీ అధ్యక్షులు బోనగిరి ప్రభాకర్, అసెంబ్లీ కార్యదర్శి మాతంగి మల్లేశం, ఏగోళ్ళ వెంకన్న గౌడ్, మండల నాయకులు సముద్రాల అంజయ్య, దేవునూరి భాస్కర్,వెదురుగట్ల సంపత్ దామేరా సతీష్ మేకల సాయి తదితరులు పాల్గొన్నారు.