రాయితీ విత్తన సరఫరా

భద్రాద్రికొత్తగూడెం,మే29(జ‌నం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా విత్తన పంపిణీకి  సొసైటీలలో విత్తనాలను కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు అన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా విత్తనాలు సరఫరా చేయనున్నారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంగూడెం జిల్లా వ్యాప్తంగా మొదటి విడతగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం బతుకమ్మ, కూనారం సన్నాలు, ఆర్‌ఎన్‌ఆర్‌ వరి రకాలకు గాను కేజీకి ఒక్కంటికి రూ10 శాతం రాయితీ ఇవ్వడం జరుగతుందన్నారు.  టీ సీడ్స్‌ మేనేజర్‌ సూచించిన ప్రకారం వివిధ రకాలైన విత్తనాలకు వచ్చే రాయితీలు  అందిస్తారు.