రాష్ట్రపతిని కలిసిన టీడీపీ బృందం

న్యూఢిల్లీ, జనంసాక్షి: కళంకిత మంత్రుల వ్యవహారంపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సేలు రాష్ట్రపతితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కళంకిత మంత్రులను తొలగించేలా చూడాలని రాష్ట్రపతికి బాబు వినతి పత్రం సమర్పించారు.