రాష్ట్ర మహసభల గోడపత్రిక ఆవిష్కరణ :జిల్లా సహాయ కార్యదర్శి త్రిపురం సుధాకర్ రెడ్డి

నవంబర్ 27,28,29  తేదీలలో యాదగిరిగుట్ట లో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల విజయవంతానికి ప్రతి కార్మికుడు కృషి చేయాలని ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి త్రిపురం సుధాకర్ రెడ్డి కార్మికులను కోరారు. గరిడేపల్లి మండల కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయం వద్ద రాష్ట్ర మహాసభల గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో  వివిధ రంగాలలో పని చేస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయులు అసంఘటిత రంగాలలో పని చేస్తున్న కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటుంన్నారని వీటన్నింటిపై సమగ్రంగా చర్చించి పోరాట కార్యక్రమం రూపొందిస్తామని ఆయన అన్నారు. నవంబర్ 27 వ తారీఖున ప్రారంభం రోజున వేలాది మంది కార్మికులతో మహా ప్రదర్శన బహిరంగసభ ఉంటుందని వేలాది మంది కార్మికులు హాజరై ప్రదర్శన బహిరంగ సభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు బెజ్జం రమేష్, జొన్నలగడ్డ తిరపయ్య, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు ఆనందరావు, పెద్ద మస్తాన్, సతీష్, వినోద్, నకిరేకంటి రవి, యడవల్లి వెంకటేశ్వర్లు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.