రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలకు శ్రీచక్ర స్పేస్ స్కూల్ విద్యార్థిని

మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 22,
జనంసాక్షి
ఇటీవల జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మినీ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సెలక్షన్ పోటీలలో శ్రీ చక్ర స్పేస్ స్కూల్ విద్యార్థిని గడ్డం నివ్య అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది.
నేటి నుండి హన్మకొండ, జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్ పోటీలలో పాల్గొననుంది.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సింగిరెడ్డి కవిత రాజేందర్ రెడ్డి విద్యార్థిని ని అభినందించారు, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగరాజ్, కిరణ్, రాజు, భువనేశ్వర్, మహేష్, నవాజ్ పాల్గొన్నారు.