రాష్ట్ర స్థాయి జానపద నృత్యం పోటీలకు ఇటిక్యాల విద్యార్థులు

జగదేవ్ పూర్ , అక్టోబర్ 13 (జనంసాక్షి): జానపద నృత్యం రాష్ట్ర స్థాయి పోటీలకు జగదేవ్ పూర్  మండలం ఇటిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవరెడ్డి తెలిపారు. గురువారం సిద్దిపేటలో జిల్లా స్థాయి జానపద నృత్యం పోటీలు జరుగగా ఇటిక్యాల పాఠశాల విద్యార్థినిలు సౌమ్య శ్రీ, నికిత, సౌమ్య, శ్రీవర్ష, స్పందన లు పాల్గొని ప్రథమస్థానంలో నిలిచారు. త్వరలో హైదరాబాదులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు హజరు కానున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి పోటీలో ప్రథమస్థానంలో నిలవడంతో విద్యార్థిలను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయురాలు రజనిని అభినందించారు.