రాహుల్‌తో ముగిసిన రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

న్యూఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యాక్షుడు రాహుల్‌ గాంధీతో రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీల భేటీ అనంతరం కాంగ్రెస్‌ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. త్వరలోనే తెలంగాణ ప్రాంత ఎంపీలతో సమావేశమవుతానని చెప్పారని ఎంపీలు తెలిపారు. మరోసారి రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలతో కూడా భేటీ అవుతానని చెప్పినట్లు వారు వెల్లడించారు.