రాహుల్ జోడో యాత్ర చారిత్రాత్మకం

అనంతగిరి జనంసాక్షి:
కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగట్టేందుకూ,దేశ ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో భారత్ పాదయాత్ర చారిత్రాత్మకం అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.శుక్రవారం మండల పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు డేగ కొండయ్య కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పాదయాత్రను నిర్వహించారు.కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ శ్రేణులు మండల కేంద్రం నుండి కోదాడ గాంధీ చౌక్ వరకు కోలాటాలు,డీజే చప్పుళ్ళతో,భారీ ర్యాలీగా పాదయాత్ర నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ నేడు మతతత్వ శక్తులతో దేశం చిన్నబిన్నం అయ్యిందని రాహుల్ జోడో భారత్ యాత్ర మళ్లీ దేశాన్ని ఏకం చేస్తుందన్నారు.కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరితో ప్రజలు విసుగు చెందారనీ,రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
2 Attachments • Scanned by Gmail