రెండవ రోజుకు చేరుకున్న వీఆర్ఏల నిరవధిక దీక్షలు.

దౌల్తాబాద్ జూలై 27, జనం సాక్షి.
తమ సమస్యల సాధన కోసం గ్రామ సేవకులు చేపట్టిన నిరవధిక దీక్ష రెండవ రోజు కు చేరుకుంది. దౌల్తాబాద్ మండల కేంద్రంలో బుధవారం నాడు వీఆర్ఏల మండల అధ్యక్షులు యాదగిరి , ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు నిరవధిక దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా వీఆర్ఏ ల సంఘం మండల అధ్యక్షులు యాదగిరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న సమ్మెలో భాగంగా వీఆర్ఏ లు తహసీల్దార్ కార్యాలయం ముందు సమ్మెలో మొకల్లా పై బైఠాయించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ లు భాను, మమత, భాగ్యశ్రీ, అంజయ్య, షాదుల్లా తదితరులు పాల్గొన్నారు.
 
Attachments area