రెండవ విడత గొర్రెల పంపిణీ పై అవగాహన సదస్సు

43,750 సభ్యుడి వాటాదనం

దంతాలపల్లి ఆగస్టు 25 జనం సాక్షి

తెలంగాణ ప్రభుత్వం రెండవ విడత గొర్రెల పంపిణీ విషయంపై యాదవులకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు మరిపెడ పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ కృష్ణమూర్తి తెలిపారు శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మొదటి విడత పంపిణీ మాదిరిగానే రెండో విడతలో కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కాగా ఒక్కో యూనిట్లో 20 గొర్రెలు ఒక పొట్టేలు ఉంటుందన్నారు మొత్తం యూనిట్ విలువ ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలని ఇందులో సభ్యుడు వాటదనం 43 వేల 750 రూపాయలు డీడీ తీసి సంబంధిత మండల పరిషత్ అధికారి గారికి అందజేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండల పశు వైద్య అధికారులు డాక్టర్ వినోద్, డాక్టర్ సౌమ్య, ఆయా గ్రామాల యాదవులు తదితరులు పాల్గొన్నారు.