రెండుకార్లు ఢీ: మంటల్లో ముగ్గురు మృతి

న్యూఢిల్లీ,జనవరి24(జ‌నంసాక్షి): ఢిల్లీలోని ఆనంద్‌విహార్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఢీకొనడంతో మంటలు చెలరేగిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా వెళ్తున్న ఏకో స్పోర్ట్‌ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో రెండు కార్లలో మంటలు చెలరేగడంతో ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం సవిూపంలోని ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముస్తాఫాబాద్‌కు చెందిన శంషాద్‌ (28), అక్షయ్‌ జైన్‌ (21) గార్వే సెహగల్‌ (30) మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.