రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి

మల్దకల్ అక్టోబర్ 13 (జనంసాక్షి) మండల పరిధిలోని సద్దలోనిపల్లి గ్రామ సమీపంలో గురువారం రాత్రి నాగలదిన్నె రంగాపురం నుండి గద్వాలకు మోటార్ సైకిల్ పై మల్లెందొడ్డి గ్రామానికి చెందిన సత్యారెడ్డి వెళుతుండగా ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ ఢీకొనడంతో  సత్యారెడ్డి తీవ్ర గాయాలు అయ్యాయి అంబులెన్సులో గద్వాల ఏరియా హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.మరో ఇద్దరు గాయాలై చికిత్స పొందుతున్నారు.