రెండేళ్ల గరిష్టానికి స్టాక్‌ మార్కెట్‌

ముంబయి: బుధవారం స్టాక్‌మార్కెట్‌ దూసుకుపోయింది. సెన్సెక్స్‌, నిఫ్టీలు రెండేళ్ల గరిష్టానికి చేరాయి. సెన్సెక్స్‌ 133,43 పాయింట్ల లాభంతో 19714,24 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 42.40 పాయింట్ల ఆధిక్యంతో 5993.25 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి.. అమెరికాల్‌ ఫిస్కల్‌ క్లివ్‌ నుంచి బయటపడేందుకు ప్రవేశపెట్టిన బిల్లును సెనేట్‌ ఆమోదించడం ప్రవంచమార్కెట్లపై సానుకూల ఫలితాలను ఏ చూపింది. వడ్డీ రేట్లను రిజర్వ్‌బ్యాంక్‌ తగ్గిస్తుందన్న వార్తలు కూడా స్టాక్‌మార్కెట్‌లో ర్యాలీకి దోహదపడింది.