రెవెన్యూ తహశీల్దార్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి నిరసన తెలిపిన విఆర్ఎలు.

నెరడిగొండ జులై29(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఎలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు వివిధ సన్నివేశాల్లో నిరంతరం తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని విఆర్ఏ మండల జేఏసీ అధ్యక్షుడు పెద్దన్న అన్నారు.శనివారం రోజున రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ పవన్ చంద్రకు,ఆఫీసు సిబ్బంది అధికారులకు విడివిడిగా పుష్ప గుచ్చాలు ఇచ్చి నిరసన తెలుపుతూ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సేవకుల అన్ని విధాల డిమాండ్లను ప్రభుత్వం అమలు చేస్తామని హామీ ఇస్తేనే సమ్మెను నిలిపివేస్తామని లేని పక్షంలో నిరవధిక సమ్మెను నిత్యం కొనసాగిస్తామని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు యధావిధిగా విధులకు హాజరుకాకుండా నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల విఆర్ఎ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రెసిడెంట్ పెద్దన్న వైస్ ప్రెసిడెంట్ ఎండి రఫీ సంధ్య కిష్టమ్మ నర్సమ్మ ఖాజా సంటెన్న సఖిల్ రాజరాం సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.