రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని దేవాదాయ శాఖలో కలపాలి
అల్లాదుర్గం జనంసాక్షి జులై : అల్లాదుర్గంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని దేవాదాయ శాఖలో కలపాలని కోరుతూ జేఏసీ నాయకులు బుధవారం దేవాదాయ శాఖ సహాయ కమీషనరు,ఎమ్మెల్మే క్రాంతికిరణ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేణుకా మాత ఆలయానికి భక్తుల నుంచి లక్షల రూపాయల ఆదాయం వస్తున్నా,ఆలయాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు తాగు నీరు సరిగా లేదని, మూత్రశాలలు సైతం లేవన్నారు. రాత్రి సమయంలో ఆలయానికి వచ్చే భక్తులకు సరైన రోడ్డు సౌకర్యం, విద్యుత్ లేదని తెలిపారు. ఆలయం వద్ద భద్రత సిబ్బంది లేకపోవడం వల్ల దొంగలు అమ్మవారి నగలు దొంగలించారన్నారు. ఆలయానికి సంబందించిన 16 ఎకరాల భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకొని ఆలయ అభివృద్ధికి అడ్డు పడుతున్నారని పేర్కొన్నారు. ఇట్టి ఆలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేయాలని గతంలో గ్రామ పంచాయతీ తీర్మాణం చేసి దేవాదాయ శాఖకు ఇవ్వడం జరిగిందన్నారు. ఆలయం అభివృద్ధి, భక్తులకు సకల సౌకర్యాల అందాలంటే రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేయాలని వారు కోరారు. వినతి న వారిలో జేఏసీ నాయకులు బ్రహ్మం ,శంకర్, సురేష్ ,సూర్యకుమార్ ,నాగిశెట్టి , మధుసూదన్,మహేష్ , నర్సింలు, తదితరులు పాల్గోన్నారు
