రేపు కర్ణాటకకు వెళ్లనున్న ఏఐసీసీ బృందం

న్యూఢిల్లీ, జనంసాక్షి: ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ఖరారు చేసేందుకు ఏకే ఆంటోని నేతృత్వంలోని నలుగురు సభ్యల ఏఐసీసీ బృందం రేపు కర్ణాటకకు వెళ్లనుంది. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఈ బృందం తెలుసుకోనుంది. సీఎం రేసులో సిద్ధరామయ్య ముందజలో ఉన్నారు.