… టిపీసీసీ కార్యదర్శి చేపూరి వినోద్
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 08, ( జనం సాక్షి) : రాబోయే రోజుల్లో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టిపిసిసి కార్యదర్శి చేపూరి వినోద్ అన్నారు. డివిజన్ కేంద్రంలో ఆయన విలేక రులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అభి వృద్ధి తప్ప, టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభి వృద్ధి శూన్యమన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు,బావులు,సబ్సిడీలోన్లు,బ్యాంకు రుణాలు, అనేక సంక్షేమ పథకాలు అందించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే దేశంలో ప్రతి ఒక్కరు సంతోషంగాఉన్నారనిఅన్నా రు.మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకివస్తేనే రాష్ట్రం అన్నివిధాలఅభివృద్ధి చెందుతున్నారు.ప్రజా సమ స్యలపై తానుఅనేకపోరాటాలునిర్వహించడంజరి గిందన్నారు. స్థానికుడుగా, దళిత బిడ్డగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే బరిలో టికెట్ ఆశిస్తున్నానని అన్నారు. గతంలో ప్రజా సమస్యలపై అనేక పోరా టాలు నిర్వహించడంజరిగిందిఅన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీలను నెరవేర్చలే దని తానుకూడా నియోజకవర్గంలో ప్రజాపోరాటా లు నిర్వహించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ అధి ష్టానం ఆదేశిస్తే స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే బరిలో నిలి చి పేద ప్రజలకు సేవ చేస్తానన్నారు.ఈ సమావేశం లో రాజారపు ఏలియా, జీడి పీటర్, జాన్, బొడ్డు అనిల్, డేవిడ్, శ్యాం బాబు తదితరులు పాల్గొన్నారు.