రైతులు పండించిన పంట నమోదు చేసుకువాలి
ఝరాసంగం జులై 21 (జనంసాక్షి)రైతులు పండించిన పంట ను నమోదు చేసుకువాలి అని మండల వ్యవసాయ అధికారి వెంకటేశం అన్నారు. గురువారం
కొల్లూరు గ్రామంలో పంట నమోదు కార్యక్రమంలో భాగంగా పత్తి మినుము పంటలను పరిశీలించడం జరిగినది ఇందులో భాగంగా వ్యవసాయ అధికారి వెంకటేష్ మాట్లాడుతూ ప్రస్తుతం పత్తి పంట 30-40 రోజుల దశలో ఉన్నది. కావున ప్రస్తుతం పెనుబంక మరియు పచ్చ దోమ ఆశించే అవకాశం ఉన్నది. కావున వీటి నివారణకు అసిఫేట్ 400 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి పిచకారీ చేయాలన్నారు.
అదేవిధంగా ఇమిదాక్లోప్రిడ్ పిచికారి చేసుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి హరికృష్ణ రైతులూ సిద్ది రాములు, వహీదా పాల్గొన్నారు
