రైతు బీమా దరఖాస్తు చేసుకోండి:మండల వ్యవసాయ అధికారి గోవిందారాజులు

దౌల్తాబాద్ జూలై 19, జనం సాక్షి.
రైతు బీమా దరఖాస్తు చేసుకోవాలని దౌల్తాబాద్ మండల వ్యవసాయ అధికారి గోవిందరాజులు తెలిపారు. వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు కొత్తగా పాసుబుక్కులు వచ్చిన రైతులు గతంలో చేసుకొని వారు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. రైతులు 18- 59 సంవత్సరాల మధ్య వయసు గలవారు ఈ రైతు బీమాకు అర్హులని తెలిపారు. ఇదివరకు ఉన్న బాండులో నామిని వివరాలు మార్చుకునే అవకాశం కూడా కలదని ఆయన తెలిపారు. అలాగే రైతు బీమా దరఖాస్తు కు కావలసిన జిరాక్స్ కాపీల వివరాలు తెలుపుతూ భూమి పాసుబుక్కు, ఆధార్ కార్డు, దరఖాస్తు ఫారం, నామిని ఆధార్ కార్డు,జిరాక్స్ కాపీలను వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలన్నారు ఈ యొక్క రైతు బీమా చివరి తేదీ 31-7-2022 ఈ యొక్క అవకాశాన్ని దౌల్తాబాద్ మండలంలోని రైతులు వినియోగించగలరు.