రైతు భీమా – రైతు కుటుంబానికి ధీమా (5 లక్షలు)

నారాయణఖేడ్ జులై26(జనంసాక్షి)

రైతులు బీమాచేసుకొని దిమాగా జీవించాలని అగ్రికల్చర్ అధికారి సంగమేశ్వర్ మంగళవారం రోజు రైతు వేదిక కార్యాలయంలో రైతులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న రైతు బీమా రైతులు అర్వులైన ప్రతి యెక్క రైతులు వినియెగించుకోవాలన్నారు   రైతు బీమా కొరకు కొత్త గా పట్ట పాస్ బుక్ లు వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవలన్నారు. మరియు ఇప్పటి వరకు రైతు బీమా చేసుకొని వారు దరఖాస్తు చేసుకోవలన్నారు. 18-59 సంవత్సరాల వయస్సు వారు అర్హులన్నారు.  ఇప్పటికే రైతు బీమా చేపించుకున్న రైతులు , మీ ఆధార్ కార్డ్ లో మరియు నామిని వివరాలు లలో ఏదైనా మార్పులు ఉన్నట్లయితే మీ ఏ ఈ ఓ  కు వారు వెంటనే తెలియ చెయ్యాలన్నారు.  చివరి తేది 20.07.2022 .

దరఖాస్తు కి కావాల్సిన పత్రాలు రైతు బీమా దరఖాస్తు ఫారం, పట్ట పాస్ బుక్ జిరాక్స్రైతు ఆధార్ కార్డ్ జిరాక్స్నా,మిని ఆధార్ కార్డ్ జిరాక్స్ స్వయంగా రైతు మాత్రమే వచ్చి దరఖాస్తు ని ఇవ్వాలన్నారు . రైతు కి బదులు గా వేరే ఎవరు దరఖాస్తు ఇచ్చిన తీసుకొంతమన్నారు. చివరి తేది 31.07.2022 ఈ తేది తర్వాత రైతు బీమా దరఖాస్తులు తీసుకోబడవన్నారు. రైతులు అందరూ ఈ విషయాన్ని గమనించగలరు మీ తోటి రైతులకు తెలియజేయగలరన్నారు.

రైతు భీమా దరఖాస్తు ఇవ్వని నమోదు చేసుకొని రైతుల కు 5లక్షలు రావన్నారు. రైతు భీమా వర్తించదు   అడిగిన ఏమి చెయ్యలేమన్నారు, భీమా ఇప్పించలేమన్నారు , కావున ఇప్పుడే మూడు అడుగులు వేసి 3 కాగితాలు అందించలన్నారు. ఆపద లో ప్రభుత్వం అందించే భీమా తో మీ కుటుంబాన్ని ఆర్థిక సంక్షోభం నుండి రక్షించుకోవాలన్నారు.