రైతు రుణ మాఫీ వేంటనే చేయాలి…

కాంగ్రెస్ పార్టీ డిమాండ్..
బేల, నవంబర్ 30 ( జనం సాక్షి  ) రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రములో రైతు పోరుబాట చేపట్టారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ అద్వర్యములో నిరసన కు దిగారు.  ఈసందర్భంగా ఎడ్ల బండి పై ర్యాలీగా వెళ్లి తహసిల్దార్ రాంరెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, డిసిసి ఇంచార్జీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ రైతులకు రుణ మాఫీ తో పాటు ధరణీ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలోనే రైతులకు పోడు భూములకు పట్టాలిచ్ఛామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తిసుక వచ్చిన ధరణీ పోర్టు ను వేంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  అదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి  శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ నాక్లే రాందాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పైజుల్లాఖాన్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సామ రుపేష్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ సంజీవరెడ్డి,వామన్ రావ్, మాజీ సర్పంచ్ రూప్ రావ్, సంజయ్ గుండావార్,ఘన్ శ్యామ్, చంద్రకాంత్ అవినాష్, శంకర్ బోక్రే, రాజు, ఎండీ అఖిల్ తదితరులు పాల్గొన్నారు…