రైతు శ్రేయస్సు కొరకే టిఆర్ఎస్ కృషి..

రైతు కుటుంబాలకు రైతు బీమా ప్రొసీడింగ్ కాపీ అందజేత..
సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 14( జనం సాక్షి): రైతు శ్రేయస్సు కొరకు దూరదృష్టితో రైతు బీమా పథకం ఏర్పాటు చేయడం జరిగిందని రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు  నాగిరెడ్డి అన్నారు. అకాల మరణం చెందిన సిద్దిపేట అర్బన్ మండలం  బక్రీ చెప్యాల గ్రామ రైతు కనకయ్య, మందపల్లి గ్రామంలో దుర్గారెడ్డి కుటుంబాలకు  ప్రభుత్వం ద్వారా వచ్చిన రైతు బీమా ప్రొసీడింగ్ కాపీలను వ్యవసాయ శాఖ మండల అధికారి పరశురాం రెడ్డి తో కలిసి శుక్రవారం అందజేశారు. టిఆర్ఎస్ పార్టీ అనునిత్యం రైతు కొరకు పాటుపడుతుందని రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధితో పాటు వ్యవసాయ అభివృద్ధి ప్రణాళికలు కూడా ముఖ్యమంత్రి రూపొందించనున్నారని ఈ సందర్భంగా నాగిరెడ్డి తెలిపారు. ఒక్కో రైతు కుటుంబానికి 5 లక్షలరూపాయలు విలువ చేసే ప్రొసీడింగ్ కాపీలు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area