రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

రైతు పక్షపాతిగా నిలుస్తా

ఆత్మ కమిటీ చైర్మన్ వడ్డేపల్లి కృష్ణ గౌడ్ ప్రమాణస్వీకారం

ప్రమాణ స్వీకరానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్
జనం సాక్షి సంగారెడ్డి టౌన్

రైతు  సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని  రైతు పక్షపాతిగా నిలబడాలని రైతులకు నిరంతరం అందుబాటులో ఉండి పనిచేయాలని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు  సంగారెడ్డి పట్టణంలోని వ్యవసాయ శాఖ  కార్యాలయంలో శుక్రవారం  సంగారెడ్డి నియోజకవర్గ  ఆత్మ కమిటీ చైర్మన్ వడ్డేపల్లి కృష్ణా గౌడ్ వారితోపాటు 23 మంది డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హాజరయ్యారు ఆత్మ కమిటీ చైర్మన్ ఆత్మ కమిటీ డైరెక్టర్ లతో ప్రమాణ స్వీకారం చేయించిన వ్యవసాయ శాఖ అధికారిని మనోరమ్మ,   ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం 24 గంటల ఉచిత కరెంటు రైతు బీమా రైతు సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని అది కేసిఆర్ తో సాధ్యమైందని ఆయన అన్నారు ,రైతుల పక్షపాతిగా నిలబడి మీ యొక్క సేవలను అందించాలని కోరారు ఆత్మ కమిటీ చైర్మన్ వడ్డేపల్లి కృష్ణ గౌడ్ మాట్లాడుతూ నా మీద నమ్మకం తోని చైర్మన్ పదవి ఇచ్చినందుకు రైతు పక్షపాతిగా నిలబడి నిరంతరం పనిచేస్తానని ఆయన అన్నారు కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, సి డి సి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, చైర్మన్ నరహరి రెడ్డి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కంది మండల్ జడ్పిటిసి కొండల్ రెడ్డి,   టిఆర్ఎస్ కంది మండల్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభాకర్, వ్యవసాయ శాఖ మండల అధికారి ప్రసాద్, 23 మంది ఆత్మ కమిటీ డైరెక్టర్లు, టిఆర్ఎస్ నాయకులు విజయేందర్ రెడ్డి, నర్సింలు, అల్పనూరి శేఖర్, శ్రవణ్ రెడ్డి, రామ్ రెడ్డి,
టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు
Attachments area