రోడ్డు ప్రమాదంలో ఎంపి మృతి
సంతాపం తెలిపిన అన్నాడిఎంకె నేతలు
చెన్నై,ఫిబ్రవరి23(జనంసాక్షి): తమిళనాట విషాదం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే సీనియర్ నేత,
విలుప్పురం ఎంపి ఎస్. రాజేంద్రన్ (62) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. శనివారం తెల్లవారు జామున ఆయన ప్రయాణిస్తున్న కారు, విల్లుపురం జిల్లా తిందివనం సవిూపంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు కావడంతో ఎంపి సహా అందులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను తక్షణమే సవిూపంలోని దవాఖానకు తరలించినప్పటికీ అప్పటికే రాజేంద్రన్ తనువు చాలించాడు. మిగతా ముగ్గురు ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో విల్లుపురం పార్లమెంట్ స్థానం నుంచి రాజేంద్రన్ గెలిచారు. ఎంపి రాజేంద్రన్ మృతి పట్ల అన్నాడీఎంకే తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేసింది. పలువురు నేతలు ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.