రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
జెడ్పీటీసీ పబ్బా మహేశ్ గుప్తా
శివ్వంపేట జూలై జనంసాక్షి :
మండల పరిధిలోని లచ్చిరెడ్డి గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని శివ్వయ గూడెం తాండాకు చెందిన కోలా బద్రు నాయక్ కుమారుడు కోలా వికాస్ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకున్న జిల్లా ఆర్థిక ప్రణాళికా సంఘం సభ్యులు, శివ్వంపేట జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి తనవంతు సహాయంగా తన స్వంత డబ్బులను 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులను కూడా అందజేశారు.ఈ సందర్భంగా జెడ్పీటీసీ మహేశ్ గుప్తా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో బద్రు కుమారున్ని కోల్పోవడం విచారకరమని, బాధిత కుటుంబానికి నర్సాపూర్ ఎమ్మేల్యే మదన్ రెడ్డి సహకారం తో ప్రభుత్వ పరంగా కూడా తప్పకుండా ఆదుకునెల కృషి చేస్తానన్నారు. లచ్చిరెడ్డిగూడెం సర్పంచ్ ఆలేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గ్రామపంచాయతీ అభివృద్ధికి తనవంతు సహకారం అందించడం తో పాటు ఎవ్వరికీ ఏ ఆపద వచ్చిన తనున్నానని బాధిత కుటుంబాలకు తన స్వంత డబ్బులను అందించి ఆదుకుంటున్న మనస్సున్న మహా మనిషి జెడ్పీటీసీ పబ్బా మహేశ్ గుప్తా నే అన్నారు. గ్రామ ప్రజలు, బాధిత కుటుంబాల తరుపున జడ్పీటీసీ కీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచుల ఫోరం మండల అద్యక్షులు నవీన్, ఎస్టిసెల్ మండల అద్యక్షులు రవి నాయక్, వైన్స్ రాజేందర్ నాయక్, తాండా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
శివ్వంపేట జూలై జనంసాక్షి :
మండల పరిధిలోని లచ్చిరెడ్డి గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని శివ్వయ గూడెం తాండాకు చెందిన కోలా బద్రు నాయక్ కుమారుడు కోలా వికాస్ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకున్న జిల్లా ఆర్థిక ప్రణాళికా సంఘం సభ్యులు, శివ్వంపేట జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి తనవంతు సహాయంగా తన స్వంత డబ్బులను 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులను కూడా అందజేశారు.ఈ సందర్భంగా జెడ్పీటీసీ మహేశ్ గుప్తా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో బద్రు కుమారున్ని కోల్పోవడం విచారకరమని, బాధిత కుటుంబానికి నర్సాపూర్ ఎమ్మేల్యే మదన్ రెడ్డి సహకారం తో ప్రభుత్వ పరంగా కూడా తప్పకుండా ఆదుకునెల కృషి చేస్తానన్నారు. లచ్చిరెడ్డిగూడెం సర్పంచ్ ఆలేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గ్రామపంచాయతీ అభివృద్ధికి తనవంతు సహకారం అందించడం తో పాటు ఎవ్వరికీ ఏ ఆపద వచ్చిన తనున్నానని బాధిత కుటుంబాలకు తన స్వంత డబ్బులను అందించి ఆదుకుంటున్న మనస్సున్న మహా మనిషి జెడ్పీటీసీ పబ్బా మహేశ్ గుప్తా నే అన్నారు. గ్రామ ప్రజలు, బాధిత కుటుంబాల తరుపున జడ్పీటీసీ కీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచుల ఫోరం మండల అద్యక్షులు నవీన్, ఎస్టిసెల్ మండల అద్యక్షులు రవి నాయక్, వైన్స్ రాజేందర్ నాయక్, తాండా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Attachments area