*లక్ష్మప్ప కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ*

పెద్దేముల్ అక్టోబర్ 23 (జనం సాక్షి)
పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పాసుల లక్ష్మప్ప మరణ వార్త తెలుసుకున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆదివారం గాజీపూర్ గ్రామానికి చేరుకొని లక్ష్మప్ప పార్థివదేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.  ఎమ్మెల్సీ వెంట ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ నారాయణరెడ్డి, పెద్దేముల్ ఎఫ్ఎసిఎస్ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు బల్వంత్ రెడ్డి, సర్పంచ్ వీరప్ప, ప్రకాశం, శ్రీనివాస్ రెడ్డి, వెంకటయ్య, లాల్ రెడ్డి, కృష్ణ, గౌస్ తదితరులు పాల్గొన్నారు.