లక్ష్మీనరసింహుని ఆలయంలో పాము..

ఖమ్మం : జిల్లా కొత్తగూడెంలోని లక్ష్మినరసింహుని ఆలయంలోకి ఆదివారం ఓ తాచుపాము ప్రవేశించింది. కొంతసేపు లక్ష్మీనరసింహుని విగ్రహంపై పడగవిప్పి కూర్చుంది. అనంతరం శఠగోపం వద్ద కొంతసేపు ఉంది. ఉదయం దేవాలయాన్ని తెరిచి శుద్ధి చేసుకుని పూజలు నిర్వహిస్తుండగా.. పాము కనిపించింది. శనివారం చంద్రగ్రహణం నేపథ్యంలో గుడి మూసివేసినప్పుడు ప్రవేశించి ఉండొచ్చని ఆలయ అర్చకులు చెబుతున్నారు.