లక్ష్యం నెరవేరింది: శోభా కరంద్లాజే

బెంగళూరు, జనంసాక్షి: బీజేపీని దెబ్బతీయాలన్న తమ లక్ష్యం నెరవేరిందని యడ్యూరపు సన్నిహితురాలు శోభా కరంద్లాజే అన్నారు. బీజేపీని చావుదెబ్బ తీసే ఉద్దేశంతోనే యడ్యూరప్ప సొంత పార్టీని ఏర్పాటు చేసినట్లు విశ్లేషణలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో వాటికి బలం చేకూర్చతూ శోభా వ్యాఖ్యలు చేయటం విశేషం
తమ ఆపరేషన్‌ విజయవంతమైందని ఆమె అన్నారు. నాలుగు నెలల పసిబిడ్డ అయన తమ పార్టీ  రానున్న లోక్‌సభ ఎన్నికల సమాయానికి బలపడుతుందని కరంద్లాజే ఆశాభావం వ్యక్తం చేశారు. బెంగళూరు రాజాజీ నగర్‌ నుంచి పోటి చేసిన ఆమె కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో ఘోర పరాజయం పాలై మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.