లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సాయి మహిళా సేవాదళ్ సభ్యులకు గొడుగులు పంపిణీ

(మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి)

లయన్స్ క్లబ్ ఆఫ్ పాలమూరు మరియు మహబూబ్ నగర్ రెండు క్లబ్ లు సంయుక్తంగా సాయి మహిళా సేవదళ్ సభ్యులకు శనివారం గొడుగులు పంపిణి చేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిస్ట్రిక్ట్ 320 ఎ గవర్నర్ హరినరాయన్ బట్టర్డ్ హాజరయ్యారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవలో లయన్స్ క్లబ్ లు ముందుండాలని సూచించారు . ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ నటరాజ్ , లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ శ్రీనివాసులు , జోనల్ చైర్మన్ గోవర్ధన్ , మాజీ రీజినల్ చైర్మన్ లు డాక్టర్ శశికాంత్ , వి ఎస్ ఆర్ కె ప్రసాద్ , మృత్యుంజయ్ , లయన్స్ క్లబ్ అధ్యక్షులు గిరి ప్రసాద్ రెడ్డి , శ్రీహరి తదితరులు పాల్గొన్నారు .