లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబై: భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్  145 పాయింట్లు లాభపడి 28, 267 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా,  నిఫ్టీ 35 పాయింట్లు లాభంతో 8,549 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. గత రెండు సెషన్లలో 775 పాయింట్లు లాభ పడ్డ సెన్సెక్స్ .. ఈ రోజు కూడా లాభాలాతో ఆరంభం కావడం స్టాక్ మార్కెట్ వినియోగదారుల్లో మరింత జోష్ ను నింపింది.