లాల్‌ ధర్వాజ మహంకాళి జాతరను రాష్ట్ర పండగగా గుర్తిస్తాం

హైదరాబాద్‌: రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి.రామచంద్రయ్య ఈ రోజు లాల్‌ధర్వాజ సింహవాహిని మహంకాళి బోనాలకు వచ్చిన ఆయన అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించారు. వచ్చే ఏడాది జరిగే బోనాల జాతర తప్పకుండా రాష్ట్ర పండుగగా జరుగుతుందని ఆయన అన్నారు. అతి త్వరలో బోనాల జాతరపై అధికారికంగా ప్రకటన చేస్తామని మంత్రి తెలిపారు.