లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహణ

మఖ్తల్ అక్టోబర్ 11 (జనంసాక్షి) మక్తల్ లైన్స్ క్లబ్ భీమా ఆధ్వర్యంలో కందూర్ రాంరెడ్డి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణంలోని లయన్స్ భవనంలో 52 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 32 మందిని ఉచిత కంటి ఆపరేషన్ కొరకు మహబూబ్ నగర్ కందూర్ రాంరెడ్డి కంటి ఆసుపత్రి కంటి చికిత్స కోసం పంపించడం జరిగిందని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సుగురు జైపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్ సభ్యులు అక్కల సత్యనారాయణ, కార్యదర్శి డీవీచారి, మామిళ్ల పృథ్వీరాజ్, అంజన్ ప్రసాద్, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అంబదాస్ పాల్గొన్నారు.