లోక్ అదాలత్ ద్వారా ఉచిత న్యాయం

దోమ సర్పంచ్ రాజిరెడ్డి
దోమ నవంబర్ 11(జనం సాక్షి)
లోక్అదాలత్ ద్వారా కక్షి దారులు ఉచిత న్యాయం పొందే అవకాశంను వినియోగించుకోవాలని దోమ మండల సర్పంచ్ల సంఘము అధ్యక్షులు కె రాజిరెడ్డి అన్నారు.శుక్రవారం దోమ మండల కేంద్రంలో పరిగి మున్సిఫ్ కోర్ట్ నుండి వచ్చిన ఉద్యోగి తో కలిసి దోమ సర్పంచ్ ఆటో స్టాండ్ ప్రాంతంలో కర పత్రాలు పంచుతూ లోక్ అదాలత్ ద్వారా అందే ఉచిత న్యాయం గురుంచి చెప్పారు కోర్ట్ ప్రాంగణల్లో నిర్వహించే క్యాంపుల వివరాలు తెలుసుకోవాలంటే పోలీస్ స్టేషన్ తో పాటు పరిగి కోర్ట్ లో కూడా తెలుసుకోవచ్చు అని అన్నారు.