లోక్ అదాలత్ ల ద్వారానే కక్షిదారులకు సత్వరన్యాయం

హుజూర్ నగర్ ఆగస్టు 13 (జనం సాక్షి): కక్షిదారులు తమ కేసులను తామే పరిష్కరించుకోవడాన్ని లోక్ అదాలత్ అంటారని సీనియర్ సివిల్ జడ్జి సి.హెచ్.ఎ.ఎన్. మూర్తి అన్నారు. శనివారం కోర్టు ప్రాంగణంలో జరిగిన లోక్ అదాలత్ లో ఆయన కక్షిదారును ఉద్దేశించి మాట్లాడుతూ లోక్ అదాలత్ ల ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం చేకూరుతుందన్నారు.  లోక్ అదాలత్ గురించి ప్రజలకు అవగాహన కలిగించుట కొరకు పారా లీగల్ వాలంటీర్స్ పల్లెల్లో పర్యటిస్తున్నారని ఆయన తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జ్ సంకేత్ మిత్ర మాట్లాడుతూ వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతుండటం, భారత్ వజ్రోత్సవాలు జరుగుతుండటం, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉండటం, కొద్ది కాలంలోనే మళ్లీ లోక్ అదాలత్ నిర్వహించటం వల్ల రాజీ అయ్యే కేసుల సంఖ్య తగ్గే విధంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ లోక్ అదాలత్ లో 55 క్రిమినల్ కేసులు, 06 సివిల్ కేసులు రాజీ కాగా న్యాయమూర్తులు ఆ కేసులను కొట్టివేశారు. 15 కేసులలో నిందితులు 2,50,000/- లను జరిమానాల రూపంలో చెల్లించారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు చనగాని యాదగిరి, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, చల్లా కృష్ణయ్య, మద్దుల నాగేశ్వరరావు, న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, అంబటి శ్రీనివాస రెడ్డి, జుట్టుకొండ సత్యనారాయణ, సురేష్ నాయక్, వట్టికూటి అంజయ్య, రమణారెడ్డి, శ్రీను నాయక్, పసుపులేటి వీరయ్య, శంకర్ నాయక్, వెంకటేష్ నాయక్, జక్కుల వీరయ్య, కొట్టు సురేష్, పిడమర్తి చంద్రయ్య, చక్రాల వెంకటేశ్వర్లు, కోర్టు సిబ్బంది శ్యాం కుమార్, రాము, రవి, శ్రావణ్, జానయ్య, తదితరులు పాల్గొన్నారు.