వంతెనపై నుంచి బస్సు బోల్తా

పలువురు ప్రయాణికులకు గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రోడ్డు ప్రమాదం జరిగింది. బూర్గంపాడు మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డి పాలెం బ్రిడ్జిపై నుంచి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. భద్రాచలం నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సారపాక-నాగినేనిప్రోలు మార్గంలో ఆర్టీసీ బస్సు వాగు వంతెనపై నుంచి అదుపు తప్పి బోల్తా పడింది. ఉదయం నుంచి కురుస్తోన్న వర్షం కారణంగా దెబ్బతిన్న రోడ్డుపై గుంతలను తప్పించబోయి బస్సు అదుపుతప్పి ఒక్కసారిగా కింద పడింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో పది మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సు భద్రాచలం నుంచి విజయవాడకు వెళ్తండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.