వంద ఎకరాల మొక్కజొన్న చేను దగ్ధం

ఖమ్మం,మే12(జ‌నం సాక్షి ): జిల్లాలోని చింతకాని శివారులో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు అంటుకుని వంద ఎకరాల్లోని మొక్కజొన్న చేను దగ్ధమైంది. సవిూపంలోని తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ మంటలు వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతుంది. మొక్కజొన్న చేను రైతులు తీవ్ర దిగ్బ్ర్రాంతికి గురయ్యారు. భారీగా ఆస్తి నష్టం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు.