వజ్రోత్సవాలకు తరలి వెళ్లిన శంకరపట్నం శ్రేణులు
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 16
జాతీయ సమైక్య వజ్రోత్సవాల లో భాగంగా మొదటి రోజు మానకొండూరు నియోజకవర్గ , శంకరపట్నం మండలం నుండి భారీగా టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు శ్రేణులు వాహనాలలో శుక్రవారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గంట మహిపాల్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవాలు భాగంగా 16 నుండి 18 వరకు నిర్వహించే వజ్రోత్సవాల కార్యక్రమాలను, విజయవంతం చేయుటకు మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపుమేరకు, మొదటి రోజు శంకరపట్నం మండలంలోని 24 గ్రామ పంచాయతీల నుండి ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళలు అభిమానులు పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు వాహనాల్లో మానకొండూర్ మండల కేంద్రంలో నిర్వహించే మొదటి రోజు జాతీయ సమైక్య వజ్రోత్సవాల కార్యక్రమానికి తరలి వెళుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ సరోజన, వైస్ ఎంపీపీ రమేష్, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చౌడమల్ల వీరస్వామి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పల్లె సంజీవరెడ్డి, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు పెద్ది శ్రీనివాసరెడ్డి, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు కాజా పాషా, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అనుబంధ సంఘాల బాధ్యులు ,మహిళా సంఘాలు, యువకులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.