వజ్రోత్సవ కీర్తి.. నిండాలి స్ఫూర్తి

జాతీయ జెండాలు పంపిణీ చేసిన కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్
మేడిపల్లి – జనంసాక్షి
స్వతంత్ర పోరాట యోధులను స్మరిస్తూ ప్రగతి పయనం కొనసాగించాలని సీఎం కెసిఆర్ యావత్ ప్రజలకు పిలుపునిచ్చారని, ప్రతి ఇంట జాతీయ జెండా ఎగరవేయాలని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మూడో డివిజన్ కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ అన్నారు. తన డివిజన్ పరిధిలోని ప్రతి ఇంటింటా జెండా అందజేసి స్వతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకోవాలని కోరారు. చిన్న పిల్లల మొదలు పెద్దలదాకా ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మేకల శ్రీనివాస్ యాదవ్, వై సోమిరెడ్డి, శ్రీనివాస్ గుప్తా, అజయ్ గౌడ్, మల్లారెడ్డి, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.