వజ్రోత్సవ వేడుకలను వేడుకలను ఘనంగా జరుపుకుందాం
*మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 13 :: స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా దేశ ఐక్యతను చాటి చెప్పడానికి ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ పిలుపునిచ్చారు స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మనోహరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి నిర్వహించిన ర్యాలీలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు ఆమె మాట్లాడుతు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి, వజ్రోస్త్సవ కార్యక్రమంలో పాల్గొని దేశ ఐక్యతను చాటాలని పిలుపు నిచ్చారు. దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతి ఒక్కరు ఐకమత్యంతో పండుగల జరుపుకోవాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి కృష్ణమూర్తి , ఎంపీడీవో యాదగిరి రెడ్డి రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి ఎంపీఓ లక్ష్మీ నరసింహ ఎస్సై రాజ గౌడ్ ఎపీఎం పెంట గౌడ్ గారు, నాయకులు ఆత్మ డైరెక్టర్ బిక్షపతి , కో ఆప్షన్ సభ్యులు మున్వర్ బాలేశ్, ఉపాధ్యాయులు విధ్యార్థులు పాల్గొన్నారు.
