వదంతులను అస్సలు నమ్మకండి : పాల్వంచ డిఎస్పీ
భద్రాద్రి కొత్తగూడెం,మే24(జనం సాక్షి): పాల్వంచ ,బూర్గంపాడు పరిసర ప్రాంతాల్లో బీహార్ రాష్ట్రానికి సంబంధించిన ముఠాలు తిరుగుతున్నాయని గత రాత్రి నుండి పుకార్లు షికార్లయి చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి వార్తలను ప్రజలు అస్సలు నమ్మవద్దని పాల్వంచ డిఎస్పీ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలియజేసారు. మతిస్థిమితం లేని ఒక వ్యక్తి భాష రాకుండా రోడ్లపై తిరుగుతుంటే అతనిని చూసి బీహార్ గ్యాంగ్ అని ప్రజలు అంతా భయబ్రాంతులకు గురయ్యారని, అతను ఇప్పుడు పాల్వంచ పోలీసుల అదుపులో ఉన్నాడని డీఎస్పీ తెలియజేసారు. ప్రజలు సోషల్ విూడియాలో చక్కర్లు కొడుతున్న ఇలాంటి వార్తలను నమ్మి భయబ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదు అని,పోలీసులు ఎల్లప్పుడూ ప్రజల రక్షణకై పాటుబడతారని తెలిపారు.అనుమానంగా ఎవరైనా వ్యక్తులు సంచరిస్తూ కనిపిస్తే వెంటనే డయల్100 కి ఫోన్ చేసి తెలపాలని అన్నారు.