వరంగల్‌ ఎంజీఎంలో వెంటిలేటర్ల కొరత

వరంగల్‌ : ఎంజీఎం ఆస్పత్రిలో వెంటిలేటర్ల కొరత ఏర్పడింది. జిల్లాలోని ఉసురుగుట్ట వద్ద స్కూల్‌ బస్సు బోల్తా పడిన ఘటనలో గాయపడిన సాయికుమార్‌ అనే చిన్నారికి వెంటిరేటర్ల అందుబాటులో లేకపోవడంతో వైద్యులు అంబూ బ్యాగ్‌తో కృతిమశ్వాస అందిస్తున్నారు. ఆస్పత్రిలో వెంటిలేటర్ల కొరత ఏర్పడటంతో రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.