వరంగల్ కాంగ్రెస్ అభ్యర్ధి రాజయ్య

వరంగల్ లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్ధిని ప్రకటించింది. వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు మళ్లీ అవకాశం ఇచ్చింది. రాజయ్య పేరుని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ఢిల్లీలో ప్రకటించారు.