వరద బాధితులు అందరికీ న్యాయం చేయాలని అడిషనల్ కలెక్టర్ ను కోరిన తెరాస నేతలు.

ములుగు జిల్లా      ఆగస్టు9  (జనంసాక్షి):-
 ఏటూరునాగారం
వరద ప్రాంతాల్లో బాధితులకు న్యాయం జరగాలని తెరాస నేతలు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్  ఐ వి గణేష్ కి ఎటునాగారం,రామన్నగూడెం, కోయగూడా ఎల్లాపూర్ గ్రామాల ప్రజలకు వరద సహాయం అందని వారి జాబితా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తెరాస జిల్లా నాయకులు తుమ్మ మల్లారెడ్డి మాట్లాడుతూ జూలై నెలలో వచ్చిన గోదావరి అధిక వరదల వల్ల కట్టు బట్టలతో పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందిన బాధితులను గుర్తించటంలో అధికార యంత్రాంగం విఫలయ్యారన్నారు. వరద ముంపు ప్రాంతాలలో బాధితుల ఎంపిక జాబితా సరిగాా లేని విషయం ఏటూూరు నాగారం తహశీల్దార్ దృష్టిిికి తీసుకెళ్లిన విషయం కూడా అడిషనల్ కలెక్టర్ కి తెలియజేశారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందాన అధికారుల తీరు ఉందని విమర్శించారు.వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతి ఒక్క వరద బాధిత కుటుంబానికి 10000/- రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించిన మాట విదితమే… కానీ అధికారులు వారి ఇష్టనుసారం బాధితులను ఎంపిక చేసి చేతులు దులుపుకున్నారన్నారు.మళ్ళీ వరద ముంపు బాధితుల విన్నపం మేరకు అధికారులు సర్వే చేసి మిగిలిన బాధితులను గుర్తించి ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమములో ములుగు జిల్లా నాయకులు గోవింద నాయక్ తెరాస జిల్లా నాయకులు తుమ్మ మల్లారెడ్డి,తెరాస ఏటూరునాగారం టౌన్ అధ్యక్షుడు ఖాజా పాషా,రాంనగర్ సర్పంచ్ గార రమాదేవి రమేష్,
ఉపసర్పంచ్ గార నాగేష్, రామన్నగూడం ఎంపిటిసి అల్లి సుమలత శ్రీనివాస్,సర్పంచ్ దొడ్డ కృష్ణా,రాంనగర్ కోయాగూడ ఉప సర్పంచ్ గార నాగేష్, సీనియర్ నాయకులు గారా ఆనంద్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.