వర్షాలు సమృద్ధిగా కురవాలంటే చెట్లను పెంచాలి
_ ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్
ఎల్లారెడ్డి 21 జూలై: (జనంసాక్షి ) వర్షాలు సమృద్ధిగా కురవాలంటే చెట్లు పెంచాలని ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారం లో భాగంగా గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై గణేష్ తో కలిసి 50 మొక్కలను నాటడం జరిగిందన్నారు. నాటిన మొక్కలలో టేకు , అల్లనేరేడు పలు రకాల పూల పండ్ల మొక్కలు, నీడ నిచ్చే మొక్కలు ఉన్నాయని ఆయన తెలిపారు. చెట్లను ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా నాటి పెంచాలని ఆయన సూచించారు. చెట్లను నాటడం వల్ల పర్యావరణ సమతుల్యతతో పాటు వర్షాలు సమృద్ధిగా కురవడమే కాకుండా, ఆక్సిజన్ కూడా పుష్కలంగా లభిస్తుందని ఆయన పేర్కొన్నారు సమాజంలో ప్రతి వ్యక్తి తన వంతు బాధ్యత గా ఐదు మొక్కలు నాటి వాటిని సవరక్షించాలని కోరారు ప్రతి విధి లో నీడ నిచ్చే చెట్లు పెంచాలని భావితరాలకు బాట వెయ్యలని సూచించారు ప్రతి ఇంటి ముందు చెట్టు వాతావరణ సమతుల్యత కు మెట్టు కావాలని కోరారు . ఈ వర్షాకాలం లోనే యుద్ధ పాతిపాధికన ప్రతి ఒక్కరు చెట్లు పెంచాలని తెలిపారు ఈ కార్యక్రమలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Attachments area