వాసవి భవన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి

గుంటూరు,అక్టోబర్‌30  (జనంసాక్షి) : నరసరావుపేట గుంటూరు రోడ్డులో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి చెందిన పాత రథశాలను వాసవి భవన్‌ గా పునర్నిర్మించిన భవనాన్ని శనివారం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా నరసరావుపేట ఇంజనీరింగ్‌ కళాశాల గ్రూప్‌ చైర్మన్‌ మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు, తిరుపతి తిరుమల సంఘం చైర్మన్‌ నాగసరపు సుబ్బరాయ గుప్త, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్‌ పాల్గోన్నారు. ప్రారంభోత్సవ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కి ఆర్య వైశ్య ప్రముఖులు ఘనస్వాగతం పలికారు. నూతనంగా నిర్మించిన వాసవి భవన్‌ ఎమ్మెల్యే గోపి రెడ్డి చేతుల విూదుగా ప్రారంభింపజేశారు దేవుళ్ళ చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితుల ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్‌ కొత్త మాసు మల్లారావు, ప్రథాన కార్యదర్శి కొత్త మాసు విశ్వనాధం,కోశాధికారి మిర్యాల నాగ ప్రసాద్‌, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్టీ అధ్యక్షులు కొత్తూరు కిషోర్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నిడమానూరు సురేంద్ర, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అడ్డగిరీ ద్వారకా వాసు, దేవస్థానం కార్యవర్గ సభ్యులు చిన్ని శ్రీనివాసరావు యక్కల వేదాద్రి, బద్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు.