విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి

జహీరాబాద్ జులై 27 (జనంసాక్షి ) విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి అని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కోహిర్ మండల కన్వీనర్ పవన్ పిలుపు మేరకు వీఆర్ఏలు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు ముఖ్యఅతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు ప్రేమ్ కుమార్ విశిష్ట అతిథిగా నియోజకవర్గ అధ్యక్షులు సుధీర్ పాల్గొన్నారు విఆర్ఏల దీక్ష కు మద్దతు తెలిపిన అనంతరం కోహిర్ మండల కన్వీనర్ పవన్ మాట్లాడుతూ,పే స్కేల్,జీవోను, వెంటనే విడుదల చేయాలని అన్నారు అర్హులైన వారికి ప్రమోషన్ ఇవ్వాలని 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాల్కల్ మండల కన్వీనర్ లవకుమార్, పైడిగుమ్మల్ గ్రామ కన్వీనర్ జాకోబ్, కో కన్వీనర్ వినయ్, వెంకటాపూర్ కన్వీనర్ మోహన్, సెక్టార్ అధ్యక్షులు ప్రశాంత్, నాయకులు దిలీప్, రాజేష్,బాల్ రాజ్,సందీప్,అనిల్,నరసింహ,మురళి,శివకుమార్,మోజేష్,అభిషేక్,నితీష్,సాగర్,తదితరులు పాల్గొన్నారు.