విజయసాయి బెయిల్‌ రద్దు

ఢిల్లీ, జనంసాక్షి: జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి బెయిల్‌ను  సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆయన బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోరిన సంగతి తెలిసిందే. జూన్‌ 5 లోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు విజయసాయిరెడ్డిని ఆదేశించింది. నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సీబిఐని ఆదేశించింది.