విజయ్‌సింగ్లాకు 20వరకు జుడిషియల్‌ కస్టడీ విధించిన ఢిల్లీ కోర్టు

న్యూఢిల్లీ, జనంసాక్షి: అవినీతి కేసులో ఆరోపణలెదుర్కొంటోన్న విజయ్‌సింగ్లాకు ఢిల్లీ కోర్టు రిమాండ్‌ విధించింది. ఇవాళ కేసును పరిశీలించిన న్యాయస్థానం సింగ్లాతో సహా ఐదుగురు జుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. ఈ నెల 20 వరకు జుడిషియల్‌ రిమాండ్‌ విధిస్తున్నట్లు కోర్టు తీర్పు ఇచ్చింది. విజయ్‌సింగ్లా కేంద్ర న్యాయశాఖ మంత్రి పవన్‌కమార్‌ బన్సల్‌కు స్వయాన మేనల్లుడు. మంత్రి మామ అండతో అవినీతికి పాల్పడ్డాడని సింగ్లాపై ఆరోపణలొస్తున్నాయి.