విద్యతోనే భవిష్యత్తుకు వెలుగులు
జహీరాబాద్ జులై 23 (జనంసాక్షి) విద్యతోనే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు వెలుగులు నింపుతాయని ఉప సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు తట్టు నారాయణ అన్నారు.శనివారం మండల పరిధిలోని అనేగుంట గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అన్ని మండల గ్రామ స్థాయిలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను ఏర్పాటు చేసిందని, పేదవిద్యార్థులు చదువుకోవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఎంతో మంది ఉన్నత స్థానాలకు ఎదిగారని, నేను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఈ స్థాయిలో ఉన్నారన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ భర్త అంబులాల్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గొల్ల జగన్నాథం మండల కో ఆప్షన్ మొయినోద్దీన్,వెంకటి తుకారాం బక్కన్న నాగిశెట్టి ,సమ్మన్న, పండరీ, టీచర్లు రాజేశ్వరి ,కల్పన విద్యార్థులు పాల్గొన్నారు